శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం
సంయుక్త మీడియా సమావేశంలో మోడి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం మోడి, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత మోడి మాట్లాడుతూ, భారత్జఅమెరికా దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని మోడి అన్నారు. రక్షణ, భద్రత, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చలు జరిపామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని, 21వ శతాబ్దంలో భారత్–అమెరికా స్నేహం కీలకమని అన్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/