సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా

మీరు మాత్రం పోస్టు చేస్తుండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. అయితే, కారణాలు తెలియదు కానీ, ఈ ఆదివారం నుంచి తాను సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలని భావించినట్టు మోడి వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను, కానీ మీరందరూ పోస్టులు చేస్తుండాలి అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/