హౌడీమోడి కొనసాగింపుగానే ‘నమస్తే ట్రంప్’

ఇరు దేశాల మైత్రీ బంధం కలకాలం వర్థిల్లాలి ..మోడి

pm modi
pm modi

అహ్మదాబాద్‌: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతుల పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, మోతెరా మైదానంలో నిర్వహిస్తోన్న ‘నమస్తే ట్రంప్’ సభలో ప్రధాని మోడి మాట్లాడారు. ఇరు దేశాల మైత్రీ బంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం పలుకుతున్నామని మోడి అన్నారు. ఇరు దేశాల మైత్రీ బంధం కలకాలం వర్థిల్లాలని చెప్పారు.గుజరాత్‌ మాత్రమే కాదు యావత్ దేశం ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందని మోడి అన్నారు. అహ్మాదాబాద్‌లోని ఈ స్టేడియం నవచరిత్రకు నాంది పలుకుతోందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోందన్నారు. హ్యూస్టన్‌లో హౌడీమోడి కార్యక్రమంలో నాంది పలికిందని, హౌడీమోడి కొనసాగింపుగానే ‘నమస్తే ట్రంప్’ జరుగుతుందని తెలిపారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/