నిర్భయ దోషుల ఉరి అమలుపై మోడి స్పందన

న్యాయం గెలిచింది…ప్రధాని మోడి

pm modi
pm modi

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరి అమలు పై ప్రధాని నరేంద్రమోడి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ”ఎట్టకేలకు న్యాయం జరిగింది. మహిళలకు గౌరవ స్థానాన్ని, రక్షణను కల్పించడంలో భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. మన నారీ శక్తి ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చుతోంది. మహిళల సాధికారతపై దృష్టి పెట్టి, సమానత్వం, సమాన అవకాశాలు కల్పించే దిశగా దేశం ముందుకు వెళ్లాల్సి ఉంది” అని తెలిపారు. కాగా ఉరి అమలుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ… ‘క్రూరమైన నేరానికి పాల్పడిన అందరు నేరస్తులకు కఠిన శిక్ష పడింది. ఈ శిక్ష మరింత త్వరగా పడితే బాగుండేది’ అని తెలిపారు. దోషులకు శిక్షపడడం పట్ల నిర్భయ తల్లి ఆశా దేవి కూడా హర్షం వ్యక్తం చేసింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/