మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు ఒక్కటే మార్గం!

నేడు ప్రధానితో మాట్లాడిన తరువాత తదుపరి నిర్ణయం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ మే 7వరకు పొడించిన సంగతి విదితమే. అయితే తాజాగా మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచనలో సిఎం కెసిఆర్‌ ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కాగా ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర తో జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రధానితో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/