తెలంగాణలో మద్యం షాపుల వద్ద సందడి

తెలంగాణలో తెల్లవారుజామునుంచే బారులు తీరిన మద్యం ప్రియులు

liquor-shop-in-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు నుండి మద్యం దుకాణాలు తెరచుకోనుండటంతో, ఈ తెల్లవారుజామునే మద్యం వ్యాపారులు రంగంలోకి దిగారు. లాక్ డౌన్ నిబంధనలు, ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా షాపుల వద్ద చర్యలు ప్రారంభించారు. మార్కింగ్ లైన్స్, రౌండ్స్ గీస్తూ, కస్టమర్లు భౌతిక దూరాన్ని పాటించే ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం కొనుగోలుకు వచ్చే వారంతా ఓ క్రమపద్ధతిలో నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే వైన్స్ షాపుల యజమానులకు సూచనలు జారీ చేశామని అన్నారు. ఇక ఉదయం 10 గంటలకు షాపులు తెరచుకోనుండగా, ఉదయం 9 గంటల నుంచే మందుబాబుల సందడి మొదలైంది. పలు దుకాణాల వద్ద కస్టమర్లు పడిగాపులు కాస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/