కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారు
దక్షిణ కొరియా అధికారులు వెల్లడి
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతు.. తాజాగా, కిమ్ ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడుతుందని భావించినా అలా జరగలేదు సరికదా, ఆయన ఆరోగ్యంపై మరిన్ని కథనాలు షికారు చేస్తున్నాయి. కిమ్కు శస్త్రచికిత్స కానీ, మరేదైనా చికిత్స కానీ జరిగి ఉంటుందని వార్తలు వస్తూనే వున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదనికిమ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందనిదక్షిణ కొరియా అధికారి ఒకరు పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/