నేటి నుంచి రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ ప్రారంభం
గోల్డ్ బాండ్ యూనిట్ (గ్రాము) ధర రూ.4,590
Mumbai: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది
ఈసారి గోల్డ్ బాండ్ యూనిట్ (గ్రాము) ధరను రూ.4,590గా నిర్ణయించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
పసిడి బాండ్ల సబ్స్ర్కిప్షన్ ఈ నెల 15వ తేదీన ముగియనుంది.
బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతోపాటు డిజిటల్ చెల్లింపులు చేపట్టే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ను ఇవ్వనున్నారు.
డిజిటల్ రూపంలో బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015 నవంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్హెచ్సీఐఎల్), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు (ఎన్ఎ్సఈ, బీఎ్సఈ) ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే, 5 ఏళ్ల తర్వాత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంటుంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/