రైల్వే ప్రయాణికులకు శుభవార్త
ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంపు
న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే జూన్ ఒకటో తేదీ నుంచి 200 రైళ్లను నడపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ రైళ్లలోని 30 ఏసీ ట్రైన్స్కు సంబంధించి టికెట్ల బుకింగ్లో తాజాగా కొన్ని మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంచింది. అంతేకాకుండా ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేసినా కన్ఫామ్ కాని వారు ప్రయాణించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్ను విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చింది.
రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్ను విడుదల చేయనుంది. టికెట్లను ఇప్పటి వరకు ఐఆర్సీటీసీ, యాప్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/