అత్యధిక కరోనా కేసుల జాబితాలో భారత్ 5వ స్థానం
24 గంటల్లో 9,971 మందికి కొత్తగా కరోనా
New Delhi: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 9,971 మందికి కొత్తగా కరోనా సోకింది.
దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో దేశంలో 287 మంది మరణించారు.
ఇండియాలో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా జరుగుతోంది.
ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య విషయంలో ఇటలీని అధిగమించి ఆరో స్ధానంలో నిలిచిన భారత్ ఇప్పుడు స్పెయిన్ ను దాటేసి ఐదో స్థానానికి చేరుకునేందుకు చేరువైంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/