తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
17వరకు ఆఫ్లైన్ దర్శన టోకెన్ల జారీ
Tirumala: లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనం కోసం బాగా రద్దీ పెరిగింది.
దీంతో ఈనెల 17వరకు ఆఫ్లైన్ దర్శన టోకెన్లను బుధవారం నుంచి తిరుపతిలో భక్తులకు జారీ చేస్తున్నారు.
తిరుపతి లోని విష్ణునివాసం (8 కౌంటర్లు), శ్రీనివాసం (6 కౌంటర్లు), అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్సులో (4 కౌంటర్లు) దర్శన టోకెన్ల జారీ కొనసాగుతోంది.
ఒక కోటాలో 3,750 టోకెన్లు ఉన్నాయి. బుధవారం సాయంత్రం కౌంటర్లు మూసే సమయానికి జూన్ 14 వరకు ఉన్న దర్శన టోకెన్లను జారీ చేశారు.
మిగిలిన టోకెన్లను గురువారం ఉద యం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లేదా నిర్దేశిత కోటా ఉన్నంత వరకు జారీ చేస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/