ఇటలీ దినపత్రికల్లో ‘శ్రద్ధాంజలి’ ప్రకటనలే
పదేసి పేజీల్లో శ్రద్ధాంజలి ప్రకటనలు
Italy: కరోనా వైరస్ కారణంగా ఇటలీలో ఇప్పటి వరకూ 1809 మంది మరణించారు. ఆదివారం ఒక్కరోజూ కరోనా వైరస్ సోకిన 368 మంది మృతి చెందారు.
ఇటలీలోని పత్రికల్లో పదేసి పేజీల్లో శ్రద్ధాంజలి ప్రకటనలు వెలువడ్డాయి. దీనితో ఆ దేశంలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు.
ఇటలీలో మరణించిన వారి సంఖ్య చైనాకు వెలుపల నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగానికి పైగా ఉండటం గమనార్హం.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/