కరోనా జన్యుక్రమాన్ని గుర్తించాం : ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్పై కీలక ప్రకటన
డబ్ల్యుహెచ్ఒ: ప్రపంచదేశాలకు వణుకుపుట్టిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19)కు సంబంధించి గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్కు సంబంధించిన జన్యు క్రమాన్ని (జెనటిక సీక్వెన్స్) గుర్తించినట్లు డబ్ల్యూహెచ్వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్లో టెక్నికల్ లీడ్గా పనిచేస్తున్న డాక్టర్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు. నేడు ఈ అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ… వైరస్కు సంబంధించిన జెనటిక్ విశ్లేషణ జరుగుతోందన్నారు. పాలీమిరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) తో పాటు సీరాలిజికల్ విశ్లేషణను పరిశోధనశాలలో నిర్వహిస్తున్నామన్నారు. కొత్త వ్యాధిగా రూపాంతరం చెందిన కరోనా వైరస్కు సంబంధించి కావాల్సినంత సమాచారం తమ దగ్గర ఉందని కెర్కోవ్ చెప్పారు. వైరస్ను అతి తక్కువ సమయంలో గుర్తించడం అసాధారణమైన విషయమన్నారు. వైరస్కు చెందిన జన్యు క్రమాన్ని కొన్ని రోజుల క్రితమే షేర్ చేసినట్లు తెలిపారు. ఇక ఇప్పుడు సిరాలాజికల్ అధ్యయనం సాగుతుందన్నారు. చైనాతో పాటు బాధిత ప్రపంచ దేశాలు కరోనా పాజిటివ్ వ్యక్తుల సీరమ్ను పరీక్ష చేయవచ్చునని పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/