భారీ వర్షాలు..మునిగిన ముంబయి

జలదిగ్బంధనంలో పలు ప్రాంతాలు

Mumbai Rains

ముంబయి: ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడ్రోజులుగా ముంబయిలో భార్షీలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలే కాదు రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు తోడు 70 కిమీ వేగంతో గాలులు కూడా వీయడంతో చెట్లు కూలిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. షేక్ మిస్త్రీ దర్గా రోడ్, బీపీటీ కాలనీ, ఖేత్వాడి, నాయర్ హాస్పిటల్, సీపీ ట్యాంక్ ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఇక దక్షిణ ముంబయి ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 12 గంటల వ్యవధిలో 294 మిమీ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో ఈ మేర వర్షపాతం నమోదవడం 1974 తర్వాత ఇదే ప్రథమం. అటు, తీవ్ర వర్షాలతో బాంబే హైకోర్టు తన కార్యకలాపాలన్నీ రద్దు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 5 బృందాలు ముంబయిలో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/