కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు

రూ.1,317 తగ్గిన బంగారం ధర

gold
gold

న్యూఢిల్లీ: కొండెక్కిన బంగారం, వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 1,317 తగ్గి రూ. 54,763కు చేరుకోగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2,943 తగ్గి, రూ. 73,600కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,564 తగ్గి, రూ. 53,951కి, వెండి ధర రూ. 2,397 తగ్గి రూ. 71,211కుచేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశవాళీ మార్కెట్ పైనా పడిందని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా బంగారం ధరలను తగ్గేలా చేశాయని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/