పాత సీరియళ్లను బయటికి తీస్తున్న దూరదర్శన్
మహభారత్, సర్కస్ల ప్రోమోలు విడుదల
ముంబయి: లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్నవారు టీవీలు చూడడం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన దూరదర్శన్ అలనాటి పాత హిట్ సీరియల్ రామాయణ్ ను పునఃప్రసారం చేస్తుంది. దీనిని ప్రేక్షకులు అమితంగా వీక్షిస్తుండడంతో, ఆనాటి హిట్ సీరియల్స్ అయినటువంటి మహభారత్, సర్కస్లను పునఃప్రసారం చేయడానికి దూరదర్శన్ సన్నాహలు చేస్తుంది. వీటికి సంబందించిన ప్రోమోలను కూడా విడుదలచేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/