నా కన్నా గొప్ప దేశభక్తుడు ఎవరూ ఉండరు
మాస్క్ ధరించడమంటే.. దేశభక్తిని చాటడమే..ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మాస్క్ను ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. గతంలో తాను మాస్క్ ధరించబోనన్నారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కూడా మాస్క్ను ధరించారు. ఇక ఇప్పుడు ఓ ట్వీట్ కూడా చేశారు. కనిపించని చైనా వైరస్ను ఓడించేందుకు మనం అందరం ఐక్యంగా పోరాడాలన్నారు. సోషల్ డిస్టాన్స్ పాటించడం వీలుకాని సమయంలో.. ముఖానికి మాస్క్ ధరించడం దేశభక్తిని చాటడమే అని కొందరంటున్నారని ట్రంప్ తన ట్విట్టర్లో వెల్లడించారు. మాస్క్ పెట్టుకుని దిగిన ఓ ఫోటోను తన ట్వీట్లో పోస్టు చేశారు. నా కన్నా గొప్ప దేశభక్తుడు ఎవరూ ఉండరని, నేను మీ ఫెవరేట్ అధ్యక్షుడినని ట్రంప్ ఆ ట్వీట్లో తెలిపారు.
మరోవైపు అమెరికాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,288 మందికి కరోనా నిర్ధారణ కాగా, 488 మంది చనిపోయారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/