బిజెపి, ఆప్ పార్టీల మధ్య మాటాల తుటాలు
ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా.. కేజ్రీవాల్ పై మండిపడ్డ జీవీఎల్
న్యూఢిల్ల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి, ఆప్ పార్టీల మధ్య మాటాల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్పై మండిపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన విద్యార్థి షర్జిల్ ఇమామ్ గురించి కేజ్రీవాల్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. విద్యార్థుల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఒక దేశద్రోహి మాదిరి మాట్లాడిన షర్జిల్ గురించి కనీసం స్పందించలేదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజద్రోహం కేసుల్లో ఉన్న కన్హయ్యతో పాటు ఇతరులను గతంలో కాపాడిన విధంగానే ఇప్పుడు షర్జిల్ ఇమామ్ ను కూడా మీరు దాచిపెట్టారంటూ కేజ్రీవాల్ పై ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు.
తాజా ఏపి వార్తల కోసం క్ల్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/