కరోనా వైరస్‌.. 80కి చేరిన మృతులు

China -Coronavirus
China -Coronavirus

బీజింగ్‌: కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు
చైనాలో 80 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం 2,744 మంది బాధితులు ఈ వైరస్ బారినపడి, పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఒకరి నుంచి ఒకరికి వేగంగా కరోనా వ్యాప్తిస్తోంది. జలుబు, దగ్గుతో మొదలవుతున్న ఈ వ్యాధిఉ నిమోనియాగా మారి ఊపిరాడకుండా చేసి చంపేస్తోంది. కాగా, చైనాతో పాటు జపాన్‌, తైవాన్‌, నేపాల్‌, హాంగ్‌కాంగ్‌, వియత్నాం, మలేషియా, సింగపూర్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు కూడా కరోనా వైరస్‌ వ్యాపించింది. ప్రస్తుతం చైనా వైద్యులు ఈ వ్యాధిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/