నేడు పశ్చిమ బెంగాల్కు శ్రామిక్ రైళ్లు రద్దు
ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు, నేల కూలిన వృక్షాలు
కోల్కతా: అంఫాన్ సూపర్ సైక్లోన్గా మరింది. ఈకారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నేడు రద్దు చేసింది. నేటి సాయంత్రం పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తుపాను తీరం దాటనుండగా.. దాని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఫలితంగా చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో మరోమార్గం లేక మహారాష్ట్ర నుంచి ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. చంద్బలీ, భువనేశ్వర్, బాలాసోర్తోపాటు పారదీప్లలో గాలులు ప్రచండ వేగంతో వీస్తున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/