జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

2019 ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు

jayaprada
jayaprada

రాంపూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ప్రముఖ సినీ నటి, బిజెపి నాయకురాలు జయపద్రకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రద ఉల్లంఘించారంటూ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో, కోర్టు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది. గత ఎన్నికలకు ముందు జయప్రద బిజెపి లో చేరారు. సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్ చేతిలో లక్ష ఓట్లకు పైగా తేడాతో ఆమె ఓడిపోయారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/