విజృంభిస్తున్న కరోనా వైరస్‌..26కు చేరిన మృతులు

అష్టదిగ్బంధనంలో 13 నగరాలు.. చైనాలోని భాతర ఎంబసీలో రిపబ్లిక్ డే వేడుకల రద్దు

Coronavirus in China
Coronavirus in China

బీజింగ్‌: చైనాలో కరోనాలో కొత్త రకం వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 26కు చేరింది. అంతేకాదు, మరో 880 మంది ఈ ఈ వైరస్ బారినపడినట్టు అధికారులు గుర్తించారు. ప్రమాదకరంగా మారిన కొత్త రకం వైరస్‌ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మొత్తం 13 నగరాలను అష్టదిగ్బంధనం చేసింది. ఆయా నగరాల్లోని ప్రజా రవాణా వ్యవస్థను మొత్తం నిలిపివేసింది. దీంతో నాలుగు కోట్ల మంది ప్రజలు ఎటూ కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో దేశంలో ఎక్కడా కొత్త సంవత్సర వేడుకల జాడ కనిపించలేదు. చైనా కొత్త సంవత్సరమైన మూషిక ఏడాది నేటి నుంచే ప్రారంభమైంది. చైనాలో ఇది అతిపెద్ద పండుగ అయినప్పటికీ ఎక్కడా సందడి లేదు. వ్యాధి మరింత విస్తరించకుండా చేపట్టే చర్యల కోసం ప్రభుత్వం వంద కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1008 కోట్లు కేటాయించింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలోకి దించారు. ఇక, చైనాలోని భారత రాయబార కార్యాలయంలో రేపు జరగాల్సిన భారత రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/