భారత్లో కొనసాగుతున్న కరోనా కేసులు
భారత్లో గత 24 గంటల్లో 134 మంది మృతి.. మొత్తం మృతుల సంఖ్య 2,549
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు భారత్లో కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,549కి చేరింది. ఇక గత 24 గంటల్లో దేశంలో 3,722 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరింది. అలాగే, కరోనా నుంచి 26,235 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 49,219 మంది చికిత్స పొందుతున్నారు. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/