భారత్ లో 107కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

పంజా విసురుతున్న వైరస్

People with Masks

New Delhi: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా తన పంజాను భారత్ పైనా విసిరింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

ఈ ఉదయానికి వందగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మధ్యాహ్నానినకి 107కు చేరుకుంది. ఒక్క మహారాష్ట్రలోనే ఆదివారం కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 31కు చేరింది. కేరళలో వీటి సంఖ్య 23, యూపీలో 11, హరియానాలో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/