తెలంగాణలో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కు నిర్ధారణ
Hyderabad: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది.
తొలుత జనగాం ఎమ్మెల్యే కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
ఆ తరువాత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కు, ఇప్పుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దీంతో ఎమ్మెల్యే ఎవరెవరిని కలిశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/