కరోనా.. ప్లేగు వ్యాధిని గుర్తు చేస్తుంది.. ట్రంప్
అమెరికాలో 2.40లక్షల మరణాలు సంభవించవచ్చని వైట్హౌస్ అంచనా
అమెరికా: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలవుతుంది. ఇప్పటికే అమెరికాలో కరోనా కేసులు 1.7లక్షలు దాటాయి. దీంతో రానున్న రెండు వారాలు అత్యంత భాదాకరమైన రోజులని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించాడు. సుమారు 2.40 లక్షల మంది దీని కారణంగా మరణించవచ్చని వైట్హౌస్ టాస్క్ఫోర్స్ అంచనా వేసింది. కరోనా మహమ్మారి ప్లేగు వ్యాధిని గుర్తు చేస్తుందని అభివర్ణించిన ట్రంప్, ముందు ముందు రానున్న కష్టకాలాన్ని ఎదుర్కోనేందుకు ప్రతి అమెరికన్ సిద్దంగా ఉండాలని సూచించాడు. కాగా నిపుణులు మాత్రం, ప్రజలందరు భౌతిక దూరాన్ని పాటించడం ఒక్కటే కరోనా వైరస్ను ఎదుర్కొనే మార్గమని అంటున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/