మిడతలపై సిఎం కెసిఆర్ సమీక్ష
అధికారులు, నిపుణులతో సిఎం ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్: పాకిస్థాన్ నుండి రాజస్థాన్లోకి అక్కడి నుండి పలు రాష్ట్రలకు మిడతలు దండుగా వస్తున్నాయి. అయితే ఈనేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మిడతల దండు రాష్ర్టానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సిఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. కాగా ఒక మిడతల దండు రోజులో దాదాపు 35000 మందికి సరిపోయే ఆహారాన్ని తినేస్తాయని నిపుణులు చెప్తున్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/nri/