ఓడిపోతామని తెలిసి సీఎం కేసిఆర్ మైండ్ గేమ్: డికె అరుణ ఆరోపణ
దీక్షలో ఉన్న ‘బండి’ కి పరామర్శ
Karim Nagar: దుబ్బాక ఎన్నికల సర్వేలో టిఆర్ ఎస్ ఓడిపోతుందని తేలడంతోనే అక్కడ అరాచాకాలను ఆ పార్టీ పాల్పడుతున్నదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ వ్యాఖ్యానించారు..
సిద్దిపేటలో పోలీసుల చర్యను నిరసిస్తూ బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని తన కార్యాలయంలో నిరసనకు దిగారు.
డీకే అరుణ దీక్షలో ఉన్న బండిని పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గెలుపు కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు..
ఎన్నికల కోడ్ లేని సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో సోదాలు జరపడం అప్రజాస్వామికమని విమర్శించారు..బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు..
ఓడిపోతామని తెలిసి సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/