విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త

మే 7 నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్రం ప్రకటన

PM Narendra Modi
PM Narendra Modi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో విదేశీ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే 7 నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల జాబితాను భారతీయ ఎంబసీలు, హై కమిషన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. అయితే వారికి మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం.. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. మే 7 నుంచి దశల వారీగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఈ విమానాలు, నౌకల్లో రావాలనుకునే భారతీయులు రవాణా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/