రెండు రోజుల పాటు బ్యాంకుల బంద్‌

banks
banks

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. శుక్రవారం, శనివారం రోజున బ్యాంకులు తమ సేవల్ని బంద్ చేస్తున్నాయి. వేతన సవరణను డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామన్నారు. అయినా కూడా ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకరించడం లేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి, సేవలందిస్తున్నా, తమను పట్టించుకోవడం లేదని బ్యాంకు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తమ సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుంటే, మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/