కరోనా వైరస్‌..కేంద్ర ప్రభుత్వం సూచన

అత్యవసరం అయితే తప్ప సింగపూర్ వెళ్లొద్దు..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

travel
travel

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవసరం అయితే తప్ప సింగపూర్ కు వెళ్లొద్దని సూచించింది. అంతగా ప్రాధాన్యం లేని పనుల కోసం సింగపూర్ కు ఇప్పుడు ప్రయాణం కావొద్దని శనివారం తెలిపింది. అలాగే, దేశంలోకి కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు కట్మాండు, ఇండోనేసియా, వియత్నాం, మలేసియా నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్టుల్లో సోమవారం నుంచి స్క్రీనింగ్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం చైనా, హాంకాంగ్, థాయ్ లాండ్ , దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ నుంచి వచ్చే వారిని 21 ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/