నామినేషన్..క్యూలో 50 మంది వెనుక కేజ్రీవాల్
కాసేపట్లో ముగియనున్న ఎన్నికల నామినేషన్ గడువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిన్న నామినేషన్ వేయలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కూడా ఆయనకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. నామినేషన్ వేయడానికి వచ్చిన కేజ్రీవాల్ క్యూలో నిలబడ్డారు. ఆయన ముందు దాదాపు 50 మంది స్వతంత్ర అభ్యర్థులు క్యూలో ఉండడం గమనార్హం. నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి ఆయన తన తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. కేజ్రీవాల్ను స్వతంత్ర అభ్యర్థులు ముందుకు వెళ్లనివ్వట్లేదు. తమలాగే క్యూలో నిలబడాల్సిందేనని అంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల్లోపు అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/