ఫోన్ ట్యాపింగ్ కేసులో16 మందికి నోటీసులు
సీబీఐతో పాటు పలు మొబైల్ ఆపరేటర్లకు నోటీసులు
అమరావతి: ఏపిలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 16 మందికి హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో సీబీఐతో పాటు రిలయన్స్, వొడాఫోన్, ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని పేర్కొంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/