ఎయిమ్స్‌లో చేరిన కేంద్రమంత్రి అమిత్‌షా

శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న షా

amit-shah

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే తనకు నెగెటివ్‌ వచ్చింది. అయితే, ఆయన మేదాంత ఆసుపత్రిలో శ్వాస కోస సమస్యతో బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అక్కడి నుంచి నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఎయిమ్స్‌లోనే ఇకపై ఆయన చికిత్స తీసుకోనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/