అమితాబ్‌కు మనమరాలి ఓదార్పు

‘తాతా… ఏడవకు’ అంటూ ధైర్యం చెప్పిన ఆరాధ్య..తీవ్ర భావోద్వేగానికి గురైన బిగ్‌బీ

Amitabh Bachchan-Aaradhya Bachchan

ముంబయి: కరోనా బారినుండి కోలుకుని ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య ముంబయిలోని నానావతి ఆస్పత్రినుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే తల్లితో కలిసి ఇంటికి బయలుదేరిన సమయంలో ఆరాధ్య తాతయ్య అమితాబ్ ను కలిసి, ఆయన్ను ఓదార్చి ధైర్యం చెప్పగా, ఆ సమయంలో అమితాబ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘తాతా…ఏడవద్దు. నువ్వు త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తావు’ అని ఆరాధ్య అనగానే, అమితాబ్ కళ్ల నుంచి నీరు కారింది. తనను చూసి ఏడుస్తున్న మనవరాలిని కౌగలించుకున్న ఆయన, ఆరాధ్యకు ధైర్యం చెప్పారు.

కాగా, ఈ నెల 17 నుంచి ఐశ్వర్య, ఆరాధ్యలు ముంబయిలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అంతకు ఒకరోజు ముందే అమితాబ్, అభిషేక్ లు కరోనా సోకి అదే హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం వారిద్దరికీ ఐసొలేషన్ వార్డులో చికిత్స జరుగుతోంది. అమితాబ్ కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ పూజలు, ప్రార్థనలు చేస్తుండగా, వారికి బచ్చన్ ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలిపింది.


మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్‌ బచ్చన్‌కు ట్విట్టర్‌లో కొందరు తీవ్ర అభ్యంతరకర మెసేజ్‌లు పంపారు. మీరు కరోనాతో చావండంటూ.. నకిలీ ఖాతాలతో ట్వీట్లు చేశారు. వీటికి బిగ్‌ బీ దీటుగా జవాబిచ్చారు. ఖమీరు కనీసం మీ తండ్రి పేరూ చెప్పుకోలేదు. మీ తండ్రెవరో తెలియదనుకుంటాగ అని రిైప్లె ఇచ్చారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/