దేశంలో 24 గంటల్లో 7,964 కొత్త కేసులు
24 గంటల్లో 265 మంది మృతి ..మొత్తం కేసులు 1,73,763
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో 7,964 మందికి కొత్తగా కరోనా సోకగా, 265 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,73,763కి చేరగా, మృతుల సంఖ్య 4,971కి చేరుకుంది. 86,422 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,370 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
మరోవైపు మహారాష్ట్రలో 62,228 కేసులు, తమిళనాడులో 20,246, ఢిల్లీలో 17,386, గుజారాత్లో 15,934 కేసులు నిర్ధారణ అయ్యాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/