మరో 73 మంది జవాన్లకు కరోనా పాజిటివ్
బీఎస్ఎఫ్లో మొత్తం 1,659 కరోనా కేసులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భద్రతా దళాలపై తన పంజా విసురుతుంది. బీఎస్ఎఫ్లో ఇప్పటికే 1500 మందికిపైగా జవాన్లు కరోనా బారినపడగా, తాజాగా మరో 73 మందికి ఈ మహమ్మారి వైరస్ సోకింది. దీంతో బీఎస్ఎఫ్లో మొత్తం బాధితుల సంఖ్య 1,659కి పెరిగింది. తాజాగా, 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 927కు పెరిగింది. మరోవైపు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లోనూ కొత్తగా 12 మందికి వైరస్ సోకగా, 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఫోర్స్లో ఇంకా 178 కేసులు యాక్టివ్గా ఉండగా, 298 మంది కోలుకున్నట్టు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/