ఢిల్లీ మసీదుల్లో ఇంకా 600 మంది విదేశియులు
తనికీలకు ప్రభుత్వ అనుమతి కోరిన పోలీసులు
దిల్లీ: దిల్లీలో జరిగిన మత ప్రార్దనలకు హాజరయ్యేందుకు వచ్చిన సుమారు 600 మంది విదేశియులు నగరం చుట్టుప్రక్కల ఉన్నటువంటి మసీదుల్లో తలదాచుకున్నారని, వారిని పట్టుకుని క్వాంరంటైన్ కేంద్రాలకు తరలించడానికి తమకు అనుమతి కావాలని కోరుతూ పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు. తబ్లీగీ జమాత్ కార్యాలయం నుండి ఇప్పటికే సమారు రెండు వేల మందికి పైగా ప్రజలను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కాగా నగర శివారుల్లోని మసీదుల్లో ఇంకా 600 మంది దాకా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు, కాబట్టి ఆ మసీదుల్లో తనికీలు చేసి వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిచేలా అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/