ఒక్కరోజే 56,282 కేసులు..904 మరణాలు

మొత్తం కేసులు 19,64,537..మొత్తం మృతులు 40,699

Coronavirus in India
Coronavirus in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 56,282 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 904 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,64,537కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 40,699కి పెరిగింది. 5,95,501 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,28,337 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,21,49,351 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,64,949 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. ఈ మేరకు ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/