తెలంగాణలో కొత్తగా 2,892 కేసులు నమోదు

మృతుల సంఖ్య మొత్తం 846

corona virus- Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్దృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 2892 పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా, 10 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,30,589కు చేర‌గా, క‌రోనా మృతులు 846కు పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 32341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 25,271 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 97,402 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 477 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/