తెలంగాణలో కొత్తగా 2,214 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,600..మొత్తం మృతుల సంఖ్య మొత్తం 1,135

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,214 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,474 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,600 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,63,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,135 కు చేరింది. ప్రస్తుతం 29,058 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 305, రంగారెడ్డి జిల్లాలో 191 కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/