దేశంలో 24 గంటల్లో 100 మంది మృతి
24 గంటల్లో 3,967 మందికి కరోనా..మొత్తం కేసులు 81,970
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3,967 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,649కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 81,970కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 27,920 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 51,401 మంది చికిత్స పొందుతున్నారు. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/