భారత్‌లో 49,391కి చేరిన కరోనా కేసులు

24 గంటల్లో దేశంలో 2,958 మందికి కొత్త కరోనా కేసుల..మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,694

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,958 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో 126 మంది ప్రాణాల కోల్పోయారు. కాగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 49,391కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 14,182 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 33,514 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/