జర్నలిస్టులకు రూ.10లక్షల ఆరోగ్య భీమా

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం

mamata benerjee
mamata benerjee

కలకత్తా: కరోనా నివారణ చర్యలలో ముందుడి నడిపిస్తున్న ఉద్యోగులందరికి రూ. 10లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇందులో జర్నలిస్టులకు కూడా చోటు కల్పిస్తున్నట్లు తెలిపారు. నేడు ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే సందర్బంగా మాట్లాడిన ముఖ్యమంత్రి మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంభం లాంటిదని, ఎలాంటి స్వార్ధం లేకుండా మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రయాలు చేపట్టిందని మమతా బెనర్జీ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/