ఏపిలో మరిన్ని కరోనా కేసులు

1,887 కు చేరిన భాధితుల సంఖ్య

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతుంది, గత 24 గంటలలో 7,320 శాంపిల్స్‌ ను పరీక్షించగా అందులో 54 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లు ఏపి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి ఏపిలో కరోనా భాధితుల సంఖ్య 1,887 కు చేరుకుంది. కొత్తగా నమోదు అయిన కేసులలో అనంతపురంలో 16, చిత్తూరు లో 3, కృష్ణాలో 6, కర్నూలులో 7, నెల్లూరులో 4, విశాఖపట్నంలో 11, ప.గో జిల్లాలో 9, గుంటూరు, విజయనగరం జిల్లాలో ఒక్కోకేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా భారిన పడి మరణించిన వారి సంఖ్య 41 కి చేరింది. మరో 842 మంది దీని భారి నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,004 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/