అతిపెద్ద సినిమా తెరను ప్రారంభించిన రామ్చరణ్

నెల్లూరు: మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దేశంలోని అతిపెద్ద సినిమా తెరను ఈరోజు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ.40 కోట్లతో పిండిపాళెంలో ఈ థియేటర్ను నిర్మించింది. రామ్చరణ్ ప్రారంభించిన ఈ థియేటర్లో ఈ నెల 30న ‘సాహో’ సినిమాను ప్రదర్శించనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్ సిస్టమ్తో థియేటర్ను నిర్మించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/