ఎయిమ్స్కు లాలూ ప్రసాద్ యాదవ్ తరలింపు
ఆదివారం మెట్లపై నుంచి పడటంతో భుజానికి ఫ్రాక్చర్
ముంబయి : దాణా కుంభకోణం కేసులో బెయిల్ పై బయట ఉన్నారు రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో ఆయన్ని ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. లాలూ ప్రసాద్ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో ఆయన కుడి భుజం ఎముక విరిగింది. దాంతో, కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేర్చించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్కు తీసుకెళ్లినట్టు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ కు తరలిస్తామని కూడ ఆయన చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, ఆయన పెద్ద కుమార్తె మీసా భారతి లాలూతోనే ఉన్నారు. ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.
కాగా, లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. బుధవారం పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి వెళ్లి లాలూను ఆయన పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/