భారీ అగ్రిప్ర‌మాదం..60 దుకాణాలు ద‌గ్థం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్రిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 60దుకాణాలు,స్టాళ్లు అగ్నికి ఆహుత‌య్యాయి. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని ఎర్ర‌కోట ఎదురుగా ఉన్న లజపత్ రాయ్ మార్కెట్ లో చోటు చేసుకుంది. దాంతో ఘ‌ట‌నాస్థ‌లికి అగ్నిమాప‌క సిబ్బంది చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసుందుకు య‌త్నించారు. ఘ‌ట‌నాస్థ‌లంలో తీసిన వీడియోలో మంట‌లు ఎగిసిప‌డిన‌ట్టు క‌నిపించాయి. ఈ మంటల్లో దుకాణాలు పూర్తిగా కాలిపోయి దగ్ధమయ్యాయి. బూడిదగా మారిపోయాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణమేమిటనే దానిపై ఇంకా సమాచారం లేదు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/