అపార్ట్ మెంట్ నుంచి దూకి యువతి ఆత్మహత్య
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన
Hyderabad: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏడుకొండలు, శమంతకమణి దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
స్థానికంగా వీరు చందానగర్ రాజీవ్ స్వగృహ లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా దంపతులిద్దరూ టైలరింగ్ చేస్తూ జీవనం గడిపేవారు.
కూతురు పూజ అంబికా (21) కాగా ఈమె బి.టెక్ కంప్యూటర్స్ చేస్తుంది. చదువుకుంటూనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంది.
గురువారం నాడు ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో అందరూ వాకింగ్ కి వెళ్లే సమయంలో రాజీవ్ స్వగృహ లోని తన అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/