భోళా శంకర్ లో ‘ఖుషి’ నడుము సీన్ రిపీట్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ ని పూర్తీ చేసి రిలీజ్ కు సిద్ధం చేసాడు. ఈ మూవీ లో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తుండగా..ఓ కీలక పాత్రలో మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడిగా పూజా హగ్దే నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే భోళా శంకర్ , గాడ్ ఫాదర్ చిత్రాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

సిస్టర్ సెంటిమెంట్ కథ తో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీకి సంబదించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చి మెగా అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఖుషి సీన్ రిపీట్ చేస్తున్నట్లు వినికిడి. ఖుషి లో పవన్ – భూమిక ల మధ్య నడుము సీన్ ఎంత హైలైట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ సీన్ ను భోళాశంకర్ లో వాడుతున్నారట. యాంకర్ శ్రీముఖి – చిరంజీవి ల మధ్య ఆ సీన్ రాబోతుందని అంటున్నారు. ఇందులో ఇద్దరూ పోటాపోటీగా నటించారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి రొమాంటిక్ చూపులు, మ్యానరిజం, డైలాగ్స్ ఈ సీన్‌లో అదిరిపోయేలా వచ్చాయని, అందుకు అనుగుణంగానే శ్రీముఖి కూడా హావభావాలు పలికించిందని చెపుతున్నారు. మరి ఆ రొమాంటిక్ సీన్ చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.